మెుదటివారిగా

మొదటివాడు కయీను,
తరువాతివాడు హేబేలు.
హేబేలు జన్మతహః తరువాతి వాడే,
కానీ,
విశ్వాస వీరుల జాబితాలో మొదటి వాడు,
దేవుని కొరకు హతసాక్షిగా మొదటి వాడు,
శ్రేష్ఠబలి అర్పించిన వారిలో మొదటి వాడు,
క్రియనుబట్టి నీతిమంతునిగా మొదటివాడు.
దేవుని మనసెరిగిన వారిలో మొదటి వాడు.
అలాగే,
మనము కూడా అనేకసార్లు అల్పులమని,
తృణీకరించ బడిన వారమని,ఎన్నిక లేని
వారమని,బలహీనులమని,సామర్ధ్యం లేని
వారమని వాపోతూ వుంటాము.
అయితే,
మనము భౌతికంగా మనుష్యులు దృష్టిలో
ఎలాగ వున్నా (హేబేలు తరువాతి వాడేను
అయినా దేవుని కొలతలో మొదటి వానిగ
ఎలా తన సాక్ష్యం తనని నిలబెట్టిందో) అలా
దేవుని కొరకు, ఆయన రాజ్యవ్యాప్తి కొరకు,
మొదటి వారిగా వాడబడుటకై ని
లిచెదము గాక!
అట్టి కృప ప్రభువు మీ(మన)కందరికిని
దయచేయును గాక!
దైవ దాసులు:పి.రాంబాబు.

Comments

Popular posts from this blog

.మొక్కలు చూడండి ఎంత దూరముగా నాటబడినా పెరిగే కొద్దీ కలిసి పోతాయి #కానీ# మనుష్యులు మాత్రం ఒక రక్తమునుండి వచ్చినా పెరిగిన కొద్దీ దూరమై పోతారు #ఎందుకో# మానవ నైజమే అంత వయస్సురిత్యా ఎదిగేపిల్లలు కన్నవారికి, ఆర్ధికంగా ఎదిగేవారు రక్థ సంబంధాలకు, ఆత్మీయంగా ఎదిగేవారు సహజత్వానికి దూరంగా,మనిషిగా ఎదిగేవాడు మానవ త్వానికి దూరంగా,చివరికి క్రీస్తులో ఎదిగే వాడు క్రీస్తుకి(ప్రేమకి)దూరంగా ........... #ఒక్కసారి# మనం పునఃపరిశీలన చేసుకుందాం

Servant of God